
Welfare Schemes Empowering Telangana
రాష్ట్రంలో పేదలందరికి సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం మహిళ కు వరం
రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .
రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాల ను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిఅన్నారు
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయము లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. .
అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను అధికారులు చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లు రెవెన్యూ ఖిమ్యా నాయక్, స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూచరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 78 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 555 సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిశాయి, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యాంగ ఉండేందుకు నిర్ణయించుకుందన్నారు రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు
మహాలక్ష్మి పథకం మహిళలకు వరం ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మొత్తం ప్రయాణికులలో 64.28 శాతం మహిళలు ప్రయాణించటం జరిగింది. ఇందుకు గాను రూ.97.54 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు.
మహిళల శక్తిగా మహిళా శక్తి పథకం జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయుటకు 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను ఇచ్చామని వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు దాదాపుగా రూ69 వేల ఆదాయం వస్తుందని అన్నారు
కొత్త రేషన్ కార్డుల మంజూరు
జిల్లాలో ఇప్పటివరకు 17,490 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగింది, దీని ద్వారా 45,576 మంది లబ్దిపొందారు. అలాగే ప్రస్తుత కార్డులలో కొత్తగా 29,858 మందిని చేర్చటం జరిగిందన్నారు.
పేదలకు ఆరోగ్యదాయనిగా మారిన రాజీవ్ ఆరోగ్యశ్రీ:అందరికీ ఆరోగ్యం” సాధించాలనే లక్ష్యంతో, రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా 1835 రకాల జబ్బులకు వైద్య సేవలను అందిస్తున్నాము. గతంలో ఉన్న వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రభుత్వం చెల్లించటం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ఏప్రిల్ 1, 2024 నుండి ఇప్పటివరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు.
నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 6,173 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు ఉన్న 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉచిత కరెంటు జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాలలో సి సి కెమెరాల ద్వారా పర్యవేక్షణ నేరాలను నియంత్రించటం జరుగుతున్నదన్నారు పోలీస్ శీ టీ o ద్వారా మహిళల కు రక్షణ కల్పించటం. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించటం జరుగుతుంని. జిల్లా ప్రజలు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాల నిర్వహన జిల్లా లో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిఘా టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు రద్దీ గల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూన్నారని అన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలకు న్యాయమూర్తులకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీ లకు,ఎమ్మెల్యే లకు , అదనపు కలెక్టర్లు జిల్లా ఎస్పీ విలేకరులకు జిల్లా అధికారులకు డి పి ఆర్ ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు