పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

Congress Congress

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలోని పోతుగల్ గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లపెల్లి రాములు గౌడ్, హౌసింగ్ ఎఈ హర్షిణి, పంచాయతీ కార్యదర్శి. సుజాత అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమం నిర్వహించి కొలతల ప్రకారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి రాములు గౌడ్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ళు లేకుండా ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు ఇందిరమ్మ ఇళ్ళ కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు లబ్ధిదారులు కృతజ్ఞత చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!