శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం

బాధ్యతలు స్వీకరించిన సిఐ.రవి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ వరంగంటి రవి అన్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని. ట్రాఫిక్ సమస్య నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. వాహనదారులు సైతం రోడ్లపై వాహనాలు పెట్టకుండా.. వారి వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే పెట్టుకోవాలని సూచించారు. మండలానికి పరివాహక ప్రాంతంలో మానేరు ఉన్న నేపథ్యంలో ఇసుక కానీ.. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే మాత్రం ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!