‘కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం’
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు.
37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – శంకుస్థాపన కార్యక్రమాలు
షాద్ నగర్/నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో మంజూరైన 37 ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నంత సేపు ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా గ్రామస్తులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసి పునాదులు తీశారు.

శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి కక్షలు దుర్మార్గాలు దౌర్జన్యాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని గత పాలకులు గ్రామంలో ఏమేం చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అందరికీ తెలుసని వారి పేర్లు తీయదలుచుకోలేదని మీడియా ముఖంగా శంకర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన వై యాదయ్య యాదవ్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో గ్రామాల్లో నిరూపిస్తున్నామని శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు సమకూరలేదని కాలయాపన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తప్ప సక్రమంగా పాలించలేదని ధ్వజమెత్తారు. నేడు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని ఉచిత బస్సు సిలిండర్ కరెంటు తోపాటు సన్నబియ్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు.