జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.

# 10 రోజుల్లో భూమిని చూపిస్తా.
# వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా.
# జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి..

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటూ నిత్యం సమాచారాన్ని అందిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు సంబందించిన భూమిని మరో 10 రోజుల్లో చూపిస్తానని పేర్కొన్నారు.అలాగే వచ్చే జూన్ నెలలో అందుకు అనుగుణంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.గతలో కేటాయించిన భూమిలో స్థలాల కేటాయింపులో సరైన క్లారిటీ లేకపోవడంతో మెడికల్ కళాశాలకు బదిలీ అయ్యిందని ఆయన పేర్కొన్నారు.ఇండ్ల స్థలాల పట్టాలను అందించడంతో పాటు,ఇండ్ల నిర్మాణం పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపెళ్ళి రవీందర్ రావు,నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *