
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలో భరత్ నగర్ లో అకాల వర్షానికి పిడుగుపాటు గురై మృతి చెందిన రుద్రారపు చంద్రయ్య కుటుంబాన్ని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరుస్తూ తనవంతు సహాయంగా 10000 రూపాయల నగదు ఇవ్వడం జరిగింది ఇట్టి విషయమై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి సహాయం అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు వైద్య శివప్రసాద్ రాజు ఎంపిటిసి రాము శ్రీనివాస్ రెడ్డి భాను నాగరాజు మునిగేల రాజు బాల్రెడ్డి శ్రీనివాస్ మనోహర్ సర్దార్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు