స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి.

స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి

మహిళ హక్కుల సామాజిక కార్యకర్త అశాలత

నిజాంపేట్ నేటి ధాత్రి:

 

భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాలలో స్త్రీ పురుషల సమానత్వం కోసం ఉద్యమించాలని మహిళ రైతుల హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు ,సామాజిక కార్యకర్త అశాలత పిలుపునిచ్చారు. గత రెండు రోజులు గా మెదక్ జల్లా నిజాంపేట్ మండల కేంద్రం లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు నాయకత్వ లక్షణాల పై శిక్షణ తరగతులు జరిగాయి.శుక్రవారంనాడు జరిగిన శిక్షణ శిబిరంలో అశాలత సామాజిక, ఆర్ధిక,రాజకీయ పరిస్థితులు జెండర్ సమ దృక్పథం పై ప్రసంగిస్తూ ఆర్ధిక,శారీరక దోపిడిని ప్రశ్నిస్తూ మహిళ పై హింసలేని సమాజ నిర్మాణం కొసం పని చెయాలన్నారు.నేటికి 65 శాతం దళిత మహిళలు భూమి లేని కూలీలుగా సామాజిక భద్రత కరువైనదనదన్నారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపంలో మానవ హక్కులు అమలవుతున్న అంటరానితనం ,వివక్ష ,దాడులు దళితులకు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అయుధంగా మలుచుకొని దాడులకు పాల్పడే వారిని జైలు లకు పంపించాలన్నారు.భూ సేకరణ చట్టం – 2013 పై కాళ్ళకల్ నిర్వాసితుల సంఘం నేత మైలారం నర్సింహ్మ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ల నుండే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని కూలీలుగా ప్రభుత్వం మారుస్తున్నారన్నారు. చట్టం ప్రకారం న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను సేకరించాలన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి భారత రాజ్యాంగం-డిబిఎఫ్ లక్ష్యం పై మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చెసుకొవడమడమే డిబిఎఫ్ లక్ష్యమన్నారు.భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కు సంఘటితం కావాలన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం అమలు పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి మాట్లాడుతూ భూమి లేని,నైపుణ్యం లేని కూలీలకు సంవత్సరానికి వంద రోజుల పని దినాలు కల్పించాలన్నారు.పని వద్ద కనీస వసతులు నీరు,నీడ,వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు.భూ బారతి చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్ మాట్లాడుతూ భూ బారతి చట్టం పై అవగహన పెంపొందించుకొవాలన్నారు. భూసంస్కరణల అమలు కొసం పొరాడాలన్నారు.దళిత ఉద్యమం మిడియా పాత్ర పై సీనియర్ జర్నలిస్టు ఆస శ్రీ రాముల మాట్లాడుతూ అంబేద్కర్ మూక్ నాయక్,మహాత్మ జ్యోతి రావు పూలే సత్యశోధక్ పత్రికలను నడిపి జాతి ని చైతన్యం చెశారన్నారు.ఈ శిక్షణ తరగతులో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,రాయిన్ పల్లి నర్సింహ్మ,చుంచు రాజేందర్,భీమ్ శేఖర్,వేణు,కల్వకుంట్ల చంద్రం కర్ణాకర్,నరెష్,రవిందర్,వాణి శారద,పల్లవి తిరుపతి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version