
Drinking Water.
మాకు తాగడానికి నీళ్లు లేవు మమ్మల్ని పట్టించుకోండి మా ప్రభువు
జంగాలపల్లి వాసుల ఆవేదన
పలమనేరు(నేటి ధాత్రి) జూలై 30:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలంలో ఉన్న పెంగరగుంట గ్రామపంచాయతీ జంగాలపల్లి గ్రామంలో గత నెల రోజులుగా తాగడానికి నీళ్లు లేకుండా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు గ్రామానికి ఏర్పాటుచేసిన రెండు బోర్లు ఉన్న కూడా గ్రామ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి స్థానిక అధికారులు కానీ సర్పంచ్ కానీ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ తమకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు మీడియా సమక్షంలో తెలిపారు 20 రోజులుగా గ్రామానికి నీటి సమస్య ఉందని స్థానిక సచివాలయ సిబ్బంది కూడా గ్రహించకపోవడం వారి పనితీరును గుర్తుచేస్తుంది ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్ కూడా ఇలా గ్రామ సమస్యను పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారంటే వారి నాయకత్వ లక్షణాలు కూడా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ గ్రామంలో ఉన్న 40 కుటుంబాలకు అందులో ఉన్న వృద్ధులు చిన్న పిల్లలు నీటి సమస్య వల్ల అమితంగా ఇబ్బంది పడుతున్నట్లు మీడియా సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో అభివృద్ధి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జంగాలపల్లె నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి వారికి నీటిని ఇస్తారో లేక వారు కూడా నిర్లక్ష్యం వహిస్తారు చూడాలి..