
గత వారం రోజుల నుండి నీళ్ల సమస్యలు పట్టించుకోని అధికారులు
పర్వతగిరి నేటి ధాత్రి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని
కల్లెడ గ్రామంలో గత ఏడు రోజుల నుండి వాటర్ రాక పోవడంతో అంబేద్కర్ దళిత ఎస్సీ కాలనీలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామంలో ఉన్న బోరు ద్వారా నీటి సరఫరా చెయ్యక లేకపోవడంతో బిందెలతో పొలాల వద్దకు వెళ్లి తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది కిఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో వాటర్ ట్యాంక్ ల ద్వారా ఎస్సీ కాలనీ ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది సిబ్బంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గ్రామంలో ఉన్న బోరు ద్వారా నేటి సరఫరా చేయాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు పట్టించుకోని అధికారులపై ఉన్నంత అధికారులు చర్య తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మూగజీవులు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి కల్లెడ గ్రామ ప్రజలను తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.