యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

Warpin, Pyi workers Warpin, Pyi workers

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని
రేపు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద
ధర్నా వై పని,పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగినది.
ఈరోజు అమృత శుక్ల కార్మిక భవనం వద్ద వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్,వార్పిన్, వై పని కార్మికులు,15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా, చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మె విరమించడం జరిగింది.

Warpin, Pyi workers
Warpin, Pyi workers

వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగింది 32 రూపాయలు ఉన్నది 34 రూపాయలు పెంచడం జరిగింది.కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారు
బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు ఒక మీటర్ కు కార్మికునికి కూలి ఉంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పనికంటే.విపరీతమైన పని భారం పెరిగింది చిన్నకోములు వస్తున్నాయి పోగులు పెరిగినాయి అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి. యజమానులు ఒప్పుకోవడం లేదు.. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం.యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగినది.అధికారుల యజమానుల మధ్య.కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల
పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు
సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి
కోడం రమణ,అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్ల వెంకటేశం, దోమల రమేష్ ఐరన్ ప్రవీణ్,సామల శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!