వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని పిడమర్తి రవికి కేటాయించాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ర్ట సాధన కొరకు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు విద్యార్థి దశ నుండి నేటివరకు పేదల పక్షాన నిలబడి పోరాడిన నేత పిడమర్తి రవి అని అంతే కాకుండ ఆపద వస్తే నేనున్న అని దైర్యం చెప్పే మాదిగ ముద్దు బిడ్డ పిడమర్తి రవి కి ఇస్తే అన్ని వర్గాల వారికి అండగా ఉంటారని ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపకులుమైస ఉపేందర్ మాదిగ అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వరంగల్ పార్లమెంటు మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని పిడమర్తి రవికి కేటాయించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేసారు.గత ప్రభుత్వాలు మాదిగలకు అండగా ఉంటామని చెప్పి మాదిగలను మోసం చేశారని దలితున్ని ముఖ్యమంత్రి నీ చేస్తాననీ కుటుంబ పాలన కొనసాగించారని వారిని వ్యతిరేకించి పేదలకు అండగా అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాదిగ ముద్దు బిడ్డ అయిన డాక్టర్ పిడమర్తి రవికి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చి మాదిగల పక్షాన నిలబడాలని మైస ఉపేందర్ మాదిగ కాంగ్రెస్ పార్టీ నీ కోరారు.మాదిగలకు సముచిత స్థానాలు కాకుండా వెనుకాల నిలబడి జెండాలు మోపిస్తున్నారు నాయకులకు జిందాబాద్ లు కొట్టించుకుంటున్నారు తప్ప రాజకీయాలలో అంతగా ఎ దగకుండా దొరల రాజ్యం, నియంత పాలన,కొనసాగిస్తే వారికి వ్యతిరేకంగా వారికి వ్యతరేకంగా మాట్లాడిన మేధావి విద్యార్థి నేత ఉస్మానియా గడ్డపై నుండి మాట్లాడిన దళిత బిడ్డ పిడమర్తి రవి అని మైస ఉపేందర్ మాదిగ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *