నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో పదార్థాల గుర్తింపు.
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
నర్సంపేట ఏసీబీ కార్యాలయం ప్రదర్శన,నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ తో ఆర్టీసీ డిపోలో తనిఖీలు.
నర్సంపేట నేటిధాత్రి:
స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు గుర్తింపు చేయవచ్చునని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.

ఈరోజు వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ నర్సంపేట ఎసిపి కార్యాలయం సందర్శించి డివిజన్ పోలీసు అధికారులకు శాంతి భద్రతల దృష్ట్యా తగు సూచనలు చేశారు.ఆనంతరం నర్సంపేట బస్ డిపో ఆవరణలో ఏమైనా మత్తు పదార్థాల రవాణా జరుగుతుందా అని అనుమానంతో స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ గంజాయి, తదితర మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్, టౌన్ సీఐ రమణమూర్తి,ఎస్ఐలు రవి కుమార్ ,అరుణ్,డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.