కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

SP. SP.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!