అంబేద్కర్ విగ్రహం కు హెలికాప్టర్ తో పుష్పాభిషేకం వాల్ పోస్టర్లు విడుదల
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుందిళ్ళ సతీష్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ పిడమర్తి రవన్న తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్,తెలంగాణ మాదిగ జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల సంఘం,ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి సంఘం చైర్మన్ అయినా డాక్టర్ పిడమర్తి రవి డిసెంబర్ 6 న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హెలికాప్టర్ తో పుష్ప అభిషేకం చేయబోతున్న కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.ఈ ప్రోగ్రాంను పెద్ద మొత్తంలో విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల నుండి పెద్ద సంఖ్యలో వేలాది మంది తరలి రావలసిందిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుందిళ్ళ సతీష్ పేర్కొన్నారు.ఎస్సీలకు ఇంటింటా సర్వే ఆధారంగా 20% జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
