భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న అంబటి వీరభద్రo గౌడ్
కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్
మరిపెడ కురవి నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు, ఆలయ ఆవరణలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గంలో ఏనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,రైతులు అందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి పథంలో నడవాలని ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి రావాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు “ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందాలి,” అని అన్నారు. ప్రజల సంక్షేమం మరియు మండల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.