భూక్య తిరుపతి నాయక్ ను పరామర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి గాయపడిన విషయం తెలుసుకొని శాంతినగర్ లోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించిన మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్.
ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, చాంద్ పాషా, గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, రేణిగుంట రాజు, రవి నాయక్, తిరుపతి నాయక్, సలీం, సంపత్, వాజిత్ శశి, తదితరులున్నారు.