పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి…
ఎఫ్ ఆర్ ఓ వజహత్
కొత్తగూడ, నేటిధాత్రి :
గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ అటవీ ప్రాంతాలలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజహత్ ఆధ్వర్యంలో శనివారం నాడు తిమ్మాపురం, ఆదిలక్ష్మిపురం, ఎంచగూడెం, కోనాపూర్, ఓటాయి ,సాదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో డిఆర్ఓ కరుణ, సెక్షన్ ఆఫీసర్లు రాజేష్, పద్మారావు, లతో కలిసి పులి కదలికలపై క్షున్నముగా పరిశీలిస్తూ,ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు…
ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ ఓ వజహత్ మాట్లాడుతూ
పులి రాత్రి వేళల్లో తెల్లవారు ఝామున సంచరించే అవకాశం ఉన్నందున,నాలుగు కాళ్ల జంతువులనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుందని, అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళల్లో ఆరు బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలి…పులి సంచరించిన గ్రామాల అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాద ముద్రలు పరిశీలిస్తున్నాం.. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి జాగ్రత్తలు చేపట్టాలని పులి తిరిగినటువంటి ఆనవాళ్లు గానీ పులి కనబడిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు కోరారు… అటవీ ప్రాంతాలలో ఆకస్మాత్తుగా మనుషుల ఉనికిని గమనిస్తే పులి దాడిచేసే అవకాశం ఉంటుందని,బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, ప్రజలు ఆరుబయట నిద్రించడం, సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదు అని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు బిక్కు, ఉదయ్, వేణుగోపాల్, సతీష్, అనిమల్ ట్రాకర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…