శేఖపూర్ లో విశ్వకర్మ జయంతి పూజాయజ్ఞం ఘనంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని మఠ సంస్థాన్ లో 30వ విశ్వకర్మ జయంతి పూజాయజ్ఞం నిర్వహించారు. అనెగొంది విశ్వకర్మ శారదా గురు పీఠము పీఠాధిపతి శ్రీ విశ్వరూపా చార్య గురుస్వాముల వారి ఆధ్వర్యంలో ఈ యజ్ఞ యాగాలు ఘనంగా జరిగాయి. యజ్ఞం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. యజ్ఞానికి వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి పూజాయజ్ఞం పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది.
