
ఎస్సై రేఖ అశోక్
వాహనాలను వేగంగా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకోవాలి
డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు చట్టపరమైన చర్యలు ఉంటాయి
అతివేగం ప్రమాదకరంగా వాహన లు నడిపే వారు త్రిబుల్ రైడింగ్ నడిపే వారిపై నిఘ ఎస్ ఐ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోనూతన సంవత్సర వేడుకలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది.నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా ఒకసారి గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలుతీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.ముఖ్యంగా తల్లిదండ్రులు తమమైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇవ్వకూడదని కోరారు.వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా మద్యం, మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలి.న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులునమోదుచేసేందుకు,అతివేగంప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి పై నిఘ పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.31వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట లోపు పూర్తిచేసుకుని తమ తమ ఇళ్లకు వెళ్లాలనికోరుచున్నాము.అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుందని.
నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈవెంట్స్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. డి జె సౌండ్ సిస్టమ్స్ పెట్టి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ, వృద్దలకు, పేషంట్లకు, గర్భవతులకు, పిల్లలకు ప్రాణహాని కలిగే విధంగా చేసే వారిపై కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వాహనాలనుఎక్విప్మెంట్ ను సీజ్ చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకోబడును.కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని గణపురం ఎస్సై రేఖ అశోక్ కోరారు.