హన్మకొండ:
గోపాలపురంలో నూతన కమిటీ సమావేశం అధ్యక్షులు పల్లెబోయిన కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ ధామరూపాల దేవేందర్ హాజరయ్యారు నూతన కమిటీకి తెలియజేస్తూ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఒక కుటుంబ పాలనగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన పాత కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఆరె రాకేష్ రెడ్డి అధ్యక్షులు కోరిక రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి తంగేళ్ల రవి ప్రసాద్ కోశాధికారి పొన్నోజు శ్రీనివాస్ మిగతా కమిటీ సభ్యులకు కొత్త కమిటీ సన్మానం చేయడంతోపాటు కాలనీ వాసులు అందరు కలిసి ఎస్సై కి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బంక సురేందర్, కోశాధికారి పోచంపల్లి రమేష్, లక్ష్మణ్, రవీందర్, తిరుపతిరెడ్డి, బజన్ నాయక్, భాస్కర్, మధుసూదన్, వెంకన్న, రవి, సంతోష్, రమణాకర్, రాజేందర్, విజేందర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.