నర్సంపేట,నేటిధాత్రి :
సమాచార హక్కు వికాస సమితి దుగ్గొండి మండల సెక్రటరీగా మల్లంపల్లి గ్రామానికి చెందిన వెండి వినయ్ కుమార్ ఎన్నికయ్యాడు.ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై. కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రగతి కోసం చట్టబద్ధ పాలనకోసం పారదర్శకత జవాబుదారీతనం పెంపుకోసం పనిచేస్తానని తెలిపారు. అవినీతి అక్రమాలను అరికట్టడం, అర్హులైన వారికి విద్య, వైద్యం, సంక్షేమం అందదానికి అలాగే అభివృద్ది పనులలో నాణ్యత కోసం ప్రజాధనం దుర్వినియోగం అడ్డుకోవడం కోసం ప్రజలు చెల్లించిన పన్నులతో పనులకు అయ్యే ప్రతి ఖర్చులు ప్రతి పౌరుడు తెలుసుకునే హక్కు,ఇతర హక్కులు,చట్టాలపై అవగాహన కల్పిస్తూ వ్యక్తి వికాసా మూలలను తెలుసుకోవడం కోసం
కార్యక్రమాలను నిర్వహిస్తామని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు.