•ప్రమాదకరంగా మారిన రోడ్లతో గ్రామస్తుల ఇబ్బందులు
• పలువురు వాహనదారులకు గాయాలు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝారసంగం నుండి మేదపల్లి మరియు ఈదులపల్లి మీదుగా నేరుగా జాతీయ రహదారి 65 దిగ్వల్ వరకు రహదారి పరిస్థితి దీనస్థితిలో ఉంది దశాబ్ద కాలం నుండి అధికారులను నాయకులను అడిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఝారసంగం మరియు మేదపల్లి మద్యలో పరిస్థితి మరి దారుణంగా ఉందని రోడ్లపై గుంతలు పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పట్టించుకోవాల్సిన అధికారులు నాయకులు పట్టించుకోక పోవటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాత్రి వేళలో గుంతలు కనిపించక పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోడ్లపై వెళ్లే వాహనాలు సైతం పాడవుతున్నాయి. దయచేసి ఉన్నతాధికారులు నాయకులు స్పందించి వెంటనే రోడ్లను నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం అని స్థానిక యువ నాయకులు అభిలాష్ రెడ్డి అన్నారు.