
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి గ్రామాలలోని పల్లె పకృతి వనాలను, మోతే గ్రామంలోని అమ్మఆదర్శ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ వర్క్స్, టాయిలెట్ వర్క్స్ మొదలగు పనులు పరిశీలించిన అనంతరం పాఠశాలకు ఈజీఎస్ లో ప్రహరి గోడ ప్రపోజల్ పెట్టమని పిఆర్ఎఈకి తెలియజేయడం జరిగినది. ఈపనులన్నీ త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పిఆర్ఏఈ సచిన్, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంఈఓ అంబటి వేణు కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ప్రధానోపాధ్యాయులు సునీత, వీవో, తదితరులు పాల్గొన్నారు.