కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పొదెం
భద్రాచలం నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి బట్టి చేసిన సేవలను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ , సీనియర్ నాయకులు రౌతు నరసింహ రావు , బంధం శ్రీనివాస్ గౌడ్ , తమ్మల్ల వెంకటేశ్వరరావు ( టీవీ ), సుంకర శేషు , గానుగ రమణ, సేవాదళ్ ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ కుమార్ , సేవల మండల అధ్యక్షులు శీలం రామ్మోహన్ రెడ్డి కాపుల శ్రీను (ఏసు ), కురుస చిట్టి బాబు , యూత్ కాంగ్రెస్ నాయకులు చింతిరాల సుధీర్ కుమార్ హలీం వాసిరెడ్డి సాంబశివరావు , కోలపూడి వరుణ్ , నాయుడు ఆర్టీసీ ఐఎన్టీయూసీ నాయకులు సింగు , శ్యామల శ్రీనివాస్ , మణి , నితిన్ అవినాష్ , స్వరూప్ , సోషల్ మీడియా ఇన్ఛార్జి సిద్ది గణేష్ మణి మహిళా నాయకులు సరిత హసీనా వసీమా జయ తదితరులు పాల్గొన్నారు