రోడ్డు వెడల్పులో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

గొర్రెకుంటలో రోడ్డు వెడల్పులో ఇండ్లు మరియు స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేసి వారిని ఆదుకోవాలని 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు ల్యాదల్ల ఆనందం( చిన్న), కాంటెస్టెంట్ కార్పొరేటర్ ఎలగొండ ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామంలో మెయిన్ రోడ్డు 60 ఫీట్లు రోడ్డు వెడల్పు చేయటం వలన ఇరువైపులా ఎస్సీ మాదిగ కులానికి చెందిన పేదల ఇండ్లు మరియు స్థలాలు కోల్పోయారని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ బాధిత కుటుంబాలు ఇండ్లు కోల్పోయి స్థలాలు లేక బయట అద్దెకట్టే ఆర్థిక స్తోమత లేదని అవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం వీరు రోజువారి కూలీలు అని పేర్కొన్నారు.బాధితులకు ప్రభుత్వ భూమిలో 120 గజాల స్థలం,ఇల్లు సాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నట్లు,అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సహకరించాలని కోరారు.గత ప్రభుత్వంలో కూడా హామీలు ఇచ్చిన అమలు కాలేదు. తగినటువంటి న్యాయం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్, గీసుకొండ ఎమ్మార్వోలకు వినతి పత్రాలు సమర్పించారని తెలిపారు. వెంటనే బాధితులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి స్థలాల కేటాయించి ప్రభుత్వం నిర్మించాలని ఈ సందర్భంగా ల్యాదల్ల ఆనందం( చిన్న),ఎలగొండ ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు 15వ డివిజన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కట్కూరి రవి,జల్ల రాజ్ కుమార్,మాజీ వార్డు సభ్యులు ల్యాదల్ల నవీన్,గాజు శ్రీనివాస్, బైరపాక ప్రేమ్ సాగర్, ఇంద మనోజ్,పోలెపాక అభిలాష్,కేదాసీ జైబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!