Victims Protest Over Remand Delay at Police Station
పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన
జహీరాబాద్ : జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ :రూరల్ పోలీస్ స్టేషన్ లో
వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీస్ అధికారులు కల్పించుకొని సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఓ వర్గం వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారిపై దాడి చేసారు. ఈ దాడుల నేపథ్యంలో నిందితుల రిమాండ్ పట్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంజీ. రాములు, గ్రామస్తులు, నిందితులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ సైదా సీఐ శివలింగం, పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
