25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్వర్ణభారతి మండల సమాఖ్య వ్యవస్థాపక పాలక వర్గం అధ్యక్షులు చెలమల్ల సంధ్యారాణి కార్యదర్శి ఎండీ రజియా కోశాధికారి సంపెల్లి సరస్వతి గారలను శాలువ షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ బాలకృష్ణ డీపీఎం సోమయ్య సీసీ లు ఇమామ్ బాబా మండలం లో ని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి మండల సమైక్య పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.