హసన్ పర్తి / నేటి ధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 65వ డివిజన్ సుబ్బాయి పల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తొలుత పెద్దమ్మ తల్లిని దర్శించుకుని గ్రామం లోకి ప్రవేశించగానే గ్రామ ప్రజలు పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి
వరంగల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పోలేపాక అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె ను ఆవిష్కరించి జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు 4 పథకాలు అమలు చేసింది. మీ గ్రామానికి ఏ పథకం వచ్చిన ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల మరమ్మత్తులను మరియు కొత్త బిల్డింగ్ లకు త్వరలోనే నా నిధుల నుంచి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పోలేపాక అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు అయ్యల రాంరెడ్డి, హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నందిపాక భాస్కర్, వర్ధన్నపేట నియోజకవర్గం.సోషల్ మీడియా ఇంచార్జ్ పుట్ట తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల పవన్, గ్రామ పార్టీ నాయకులు పుట్ట సురేందర్, కృష్ణా స్వామి, వస్కుల చిరంజీవి, చుంచు కోమల వాసు ,గ్రామ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.