
Varalakshmi Vrata
అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం, ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, పూజలు ఘనంగా నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయినిలు అందరూ వాయనం ఇచ్చుకున్నారు. తదనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డికి రాఖీలు కట్టడం జరిగినది. ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్, డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు