# తొగర్రాయిలో పశువులకు గాలి కుంటూ వ్యాధి టీకాల కార్యక్రమం.
దుగ్గొండి,నేటిధాత్రి :
పశువులకు గాలికుంటూ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలను వేయించాలని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట డివిజన్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి ఎన్ రెడ్డి తెలిపారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో పశువులకు గాలికుంటూ వ్యాధి టీకాల కార్యక్రమం స్థానిక పశు వైద్య శాఖ అధికారి లూనావత్ శారద ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామంలో
మొత్తం164 పశువులు, 42 తెల్ల పశువులు,122 గేదెలకు టీకాలు చేసినట్లు డాక్టర్ శారద తెలిపారు.
జరిగింది.ఇందులో డాక్టర్. B N రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ నర్సంపేట గారు డాక్టర్. యల్. శారద,ఏంఏ గఫార్,విఎల్ఓ స్టాఫ్ కుమార్, గోపాలమిత్రలు అక్బర్ పాషా, రాజకుమార్, రైతులు పాల్గొన్నారు.