రేగొండ, నేతిధాత్రి:
వేసవి కాలం సమీపిస్తున్న వేళ గొర్రెలకు ముందస్తు అమ్మ తల్లి టీకాలు వేయించుకోవాలని రేగొండ ప్రాథమిక పశువైద్యాధికారి డా.వి.మైథిలి ఒక ప్రకటనలో తెలిపారు.మండలం మొత్తంలో దాదాపు 30 వేల గొర్రెలు ఉండగా వేసవి కాలం ప్రారంభం కానున్న వేళ అమ్మ తల్లి అయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గొర్రెలకు చర్మం పై వేడి పొక్కులు,జ్యరం,ఆకలి మందగించడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.ఈ మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్యశాలలో షీప్ పాక్స్ టీకా అందుబాటులో ఉందని పశువుల కాపరులు ముందస్తు టీకా వేయించుకోవడం వల్ల వ్యాధిని నివారించవచ్చని డాక్టర్ తెలిపారు.