తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన సిద్దయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన బస్వాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సత్తు శ్రీనివాస్ రెడ్డి .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతిచెందగా వారి కొడుకు అందవైకల్యంతో ఉన్నందున వారి కుటుంబం అంతిమ సంస్కారాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారి కుటుంబాన్ని పరామర్శించి 3000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగిందని వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు గమనించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారికి ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుచున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధుకర్ జిల్లా కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు