జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ.

HeadQuarters. HeadQuarters.

జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ

మరిపెడ /సిరోలు నేటిధాత్రి.

 

 

 

 

మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ని కొత్తూరు సి గ్రామానికి చెందిన
దాత దయ్యాల నాగేశ్వర్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన మాత జ్ఞాన సరస్వతి విగ్రహం మరియు సభ వేదికను,ఘనంగా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై,సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా ప్రాధాన్యతను వివరించారు. “విద్య వల్లే వ్యక్తి వికాసం సాధ్యం అన్నారు, మాత జ్ఞాన సరస్వతి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి,” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కురవి మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్,సిరోల్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి,డిఇఓ రవీందర్ రెడ్డి,ఎంఈఓ లచ్చిరామ్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మలిశేటి వేణు,పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఇటువంటి సత్కార్యాలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజల అభిప్రాయపడ్డారు,దాత నాగేశ్వర్ గౌడ్ అందించిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!