అకాల వర్షం రైతన్నకు నష్టం.

Farmer Farmer

అకాల వర్షం… రైతన్నకు నష్టం….

◆ నేలకొరిగిన జొన్న పంట…..!
◆ దెబ్బతిన్న ఉల్లి విరిగిన చెట్లు,…!
◆ పడిపోయిన విద్యుత్ స్తంభాలు….!

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం తో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కురిసిన అకాల వర్షంతో రైతులు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతేకాక భారీ గాలులతో పాటు వర్షం కురవ డంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయి వైర్లు తెగిపడ్డాయి.

శు క్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు భారీ గాలి వీచి వ డగళ్ల వర్షం కురిసింది.

ధంగా శనివారం సాయంత్రం కూడా మండలంలో అక్కడ ఈదురు గాలులు వీచి వడగ ల వర్షాలు కురిశాయి.

దీంతో పంట పొలాల్లో ఏపుగా పెరి గిన జొన్న పంట నేలకొరిగి నష్టం సంభవించింది.

అదేవిధం గా ఉల్లి పంటతో పాటు ఇతర పలు రకాల పంటలు వర్షాల తో దెబ్బతిన్నాయి.

వనంపల్లి, తుమ్మన్ పల్లి, బొప్పాన్ పల్లి, సంగం(కె), కంబాలపల్లి, గుంత మర్పల్లి, జీర్లపల్లి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడి న వడగండ్ల వాన కురిసింది.

ఆయా గ్రామాల్లో రైతుల పొలా ల్లో చేతికొచ్చిన జొన్న పంట నేలకొరిగింది.

బొప్పాన్ పల్లి గ్రా మ శివారులో ఉల్లి పంట వడగండ్ల వానతో దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన కనబరిచారు.

అక్కడ రవాదారిపై చెట్టు కులడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇది గమనించిన రైతులు చెట్ల కొమ్మలను రోడ్డుపై నుండి తొలగిం చ డంతో రాకపోకలకు వీలు కలిగింది.

మండల కేంద్రమైన ఝరాసంగంలో కేతకీ ఆలయానికి కొద్ది దూరంలో ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

Farmer
Farmer

అదేవిధంగా మండలం లోని పలు గ్రామాల్లో కూడా ఈదురు గాలులు, వర్షాలకు విద్యుత్ సరఫరకు అంతరాయం కలగడంతో శుక్రవారం రా త్రి గ్రామాల్లో అంధకారం నెలకొంది.

అలాగే శనివారం కూ డా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడ్డారు.

ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని దెబ్బతి న్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని రైతులు వేడు కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!