రైతన్నలను వెంటాడుతున్న అకాల వర్షం.

Rain haunts Rain haunts

రైతన్నలను వెంటాడుతున్న అకాల వర్షం….

– మరోవైపు లారీల కొరత…

– జిల్లా అధికార యంత్రాంగం చో రవ తీసుకోవాలి వివిధ గ్రామాల రైతుల ఆవేదన….

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

ఆరుగాలం పండించిన వరి ధాన్యం పంట అమ్ముకుందామంటే గత వారం రోజుల నుంచి అకాల వర్షం రైతన్నలను వెంటాడుతూనే ఉంది. ఏటు చూసినా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షం, మరోవైపు లారీల కొరత ఈ కష్టాలు మాకేనా అంటూ అన్నమొ రామచంద్ర అంటూ రైతన్నలు బోరున విలిపిస్తున్నారు.

 Rain haunts
Rain haunts

ఒకవైపు సొసైటీ పాలకవర్గాల నిర్లక్ష్యం తోటి రైతుల వరి ధాన్యం తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. లారీలు రాక వెనుకబడ్డ రైతులకు ఒక్క బస్తాకు సుమారు రెండు రూపాయలకు నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తే పండించిన పంట డబ్బులు చేతికొచ్చే వరకు రైతుల కళ్ళల్లో కన్నీరే కాదు రక్త నీరు వస్తున్నాయి.

 Rain haunts
Rain haunts

ఎటు చూసినా రైతుల కష్టాలు.. రైతుల వైపు కన్నెత్తి చూడని రాజకీయ నాయకులు.. వారికి అవసరం ఉంటేనే పలకరిస్తారు … రైతుల నుంచి ఏ యొక్క రాజకీయ నాయకుడు రైతుల పక్షాన ధర్నా చేసిన దాఖలాలు లేవు. కొనుగోలు కేంద్రాలలో నిలిచిన వరి ధాన్యాన్ని జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వరి ధాన్యాన్ని అతి తొందరగా తరలించాలని వివిధ గ్రామాల రైతులు జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!