జమ్మికుంట :నేటి ధాత్రి
బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఓ వరం లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఈ నెల 18న ప్రధాని మోదీ కిసాన్ సమ్మేళన ప్రోగ్రాం నేపథ్యంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో వర్చువల్ గా జరిగే ప్రోగ్రామ్ ఏర్పాట్లను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్చువల్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఇట్టి ప్రోగ్రాం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర జల, రైల్వే సహాయక మంత్రి వి సోమన్న హాజరవుతారని తెలిపారు జమ్మికుంటలో జరగబోయే కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ముఖ్యంగా 17వ విడత కిసాన్ సమ్మాన్ విధి యువజన నిధులు విడుదల చేయడం జరిగిందని ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఫైల్ పైనే మూడోసారిగా ప్రధానమంత్రి మోడీ సంతకం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యంగా మిలియన్లు రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుంది అన్నారు ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభ కావడంతో రైతులకు పెట్టుబడి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు రావు గారు ప్రభాకర్ అనిల్ ప్రశాంతి జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జిల్లా కిసాన్ మోర్చా మాడుగుల సమ్మిరెడ్డి జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపదరావు పల్లపు రవి దొంతల రాజకుమార్ పరిపెల్లి కొండల్ రెడ్డి కైలాస కోటి గణేష్ మోతీ స్వామి అప్పం మధు యాదవ్ ఇటుకల స్వరూప భీమిలి కిషన్ రావు మోడం రాజు గిరవైన విజేందర్ మేక సుధాకర్ రెడ్డి రాచపల్లి ప్రశాంత్ గర్రపల్లి నిరూప రాణి దేవులపల్లి నవీన్ బచ్చు శివకుమార్ రవీందర్ బద్రి యాంసాన్ని సమ్మయ్య కొండపర్తి ప్రవీణ్ రాపర్తి ప్రవీణ్ తేజస్వరూప రాపర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు
జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో వర్చువల్ గా జరిగే ప్రోగ్రామ్ కు హాజరుకానున్న కేంద్రమంత్రి సోమన్న రైతులందరూ 18న జమ్మికుంట లో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనండి
