
Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar
బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో అడగగానే బోర్ మంజూరు చేపిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో శాలివాహన సంఘం నాయకులు, తిర్మలాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు, రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి విన్నవించుకోగానే నిధులు మంజూరు చేశారని, నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యం కృషి చేస్తున్నారని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని,బీజేపీ తోనే కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, సీనియర్ నాయకులు తడగొండ అశోక్, బూత్ కమిటీ అధ్యక్షులు పెంచాల నరేష్, పాదం సాగర్, పాదం రవి, శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.