ఆగని నీటి కష్టాలు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ 12వ వార్డులో గత వారం పది రోజులుగా ప్రజలకు సరిపడా మంచి నీరు బోర్, మంజీరా నీరు రావటం లేదు. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే చాలు హౌసింగ్ బోర్డు చివరి కాలనీ లో నీటి సమస్య ప్రతిసారి ఉంటుంది. అంబంధిత అధికారులకు తెలిసిన పటించుకోవడం లేదు. వాటర్ మ్యాన్ డబ్బులు తీసుకొని తెలిసిన వారికి గంటల కొద్ది నీరు వదులుతున్నారు. కాని సామన్య ప్రజలకు మాత్రం కొద్దిసేపు వదిలి ఆఫ్ చేస్తున్నారు. పై స్థాయి అధికారులు స్పందించి కాలనీ వాసులు కొత్త బోర్ వేయించి మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.