దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నరేన్ గార్డెన్ లో 170 మంది పార్టీలో చేరారు

కూకట్పల్లి ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేట ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు మధులత,సీనియర్ నాయ కులు బాలస్వామి,మో జెస్,పోశెట్టిగౌ డ్,యాదగిరి,ఫారూఖ్,ఖాలీమ్,భిక్షపతి,రవీందర్,పుట్టం
దేవి,సరిత,పర్వీన్,యస్మిద్,మహముదాలు కాంగ్రెస్ కండువా కప్పు కుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు వందమంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది.సోమవా రం రోజు ఉదయం నల్లగండ్లలోని జగదీ శ్వర్ గౌడ్ సమక్షంలో సుమారు 170 మంది నరేన్ గార్డెన్ లో పార్టీలో చేరారు. అంతకు ముందు నల్లగండ్ల లోని ఆయన నివాసం వద్ద 30 మంది పార్టీ తీర్థం పు చ్చుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మారిన కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ విషయాన్ని మీడియా మిత్రులతో తెలి యజేశారు.ఈ సందర్భంగా కార్పొ రేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాను న్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి చేవెళ్ల పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించా లని అన్నారు.కార్యక్ర మంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,అగ్రవాసు,సంగమే ష్,రాజు,అరుణ,బాలస్వామి సాగర్,త దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *