కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖమాసం వసంత రుతువు ఉత్తరాయణం శుక్ల విదియ కృత్తిక నక్షత్రం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కోట గుళ్ళు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు గ్రామదేవతలకు హారతి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు రౌతు కిషోర్, పాణిగంటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.