సదాశయ ఫౌండేషన్ ఓదెల మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు టి. శ్రవణ్ కుమార్, కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో ఓదెల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఓదెల మండలం సదాశయఫౌండేషన్ సభ్యులు, అవయవ శరీర నేత్రదానాలతో పాటు ఇతర అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఓదెల మండలాన్ని రాష్ట్రం లో ఉన్నతంగా నిలిపి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఓదెల చుట్టుపక్కల 160 పైగా అవయవ నేత్రదానం చేసిన సందర్బంగా ,160 పైన మందితో రక్తదానం చేసే కార్యక్రమం మార్చి మొదటి వారంలో చేయుటకు సన్నాహం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపినారు.నూతన కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ కోండ్ర వేణు, ప్రధాన కార్యదర్శి క్యాతం వెంకటేశ్వర్లు,ఉపాద్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,డాక్టర్ దాసరి శంకర్ ,కార్యదర్శులు మేరుగు సారంగం,క్యాతం రాజేంద్రప్రసాద్,సంయుక్త కార్యదర్శులు క్యాతం మల్లేశం, అల్లం సతీష్,సలహాదారులు క్యాతం సత్యనారాయణ,( టి.వి)భువనగిరి రాజు,గౌరవ అధ్యక్షులు ఒజ్జ శ్రీనివాస్. .ఎగ్జిక్యూటివ్ మెంబర్లు క్యాతం లావణ్య, క్యాతం భాగ్యలక్ష్మి, మేరుగు దేవకి,జీడి నవీన్, నాగవెల్లి నిఖిల్, తుమ్మ మధుకర్ పేర్లు ప్రకటించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *