అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు ఆత్మ హత్య
సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):
సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ కు చెందిన వలస రమేష్(48) అనే నేతకార్మికుడు అప్పుల బాధలు తట్టుకోలేక కార్గిల్ లేక్ చెరువులో దూకి ఆత్మ హత్య చేసుకోని మృతి చెందాడని జరిగినది. నేత కార్మికుడైన రమేష్ పవర్ లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.గత ఏడాది నుండి సరైన ఉపాధి లేక చేసిన అప్పులు 5 లక్షలు ఇక ఎలా తీర్చాలో తెలియక కార్గిల్ లేక్ చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నాడని మృతుని బంధువులు తెలిపారు.మృతుని భార్య లావణ్య, సాయి చరణ్, సచిన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగినది.