గ్రీన్ భద్రాద్రి నూతన అధ్యక్షులుగా ఉమా శంకర్ నాయుడు ఏకగ్రీవ ఎంపిక

భద్రాచలం నేటి దాత్రి

ఈరోజు గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ఏగి సూర్యనారాయణ స్వగృహమునందు గ్రీన్ భద్రాద్రి సర్వసభ్య సమావేశం చేపట్టబడినది. ఈ కార్యక్రమంలో 2024 – 25 సంవత్సరానికి నూతన కమిటీ నియామకం జరిగినది. నూతన అధ్యక్షులుగా అంకి శెట్టి ఉమా శంకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా పామరాజు తిరుమలరావు, కోశాధికారిగా లకావత్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఆర్ రామకృష్ణారెడ్డి, మహిళా కార్యదర్శిగా పూసం రవి కుమారి తదితరులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగినది . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రీన్ భద్రాద్రి పేరు ప్రతిష్టలు పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని మొక్కలు అధిక శాతం లో నాటి పచ్చదనానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచనలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బెల్లంకొండ రాంబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీరంగం సంపత్, కోశాధికారి విష్ణుమోలకల సుబ్రహ్మణ్యం, లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వరరావు గ్రీన్ భద్రాద్రి ఫౌండర్ చైర్మన్ బొలిశెట్టి రంగారావు, జి. రాజారెడ్డి, కె. అబ్రహం, సోమరౌతు శ్రీనివాసరావు, గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు ఏగి సూర్యనారాయణ, మాజీ అధ్యక్షులు కామిశెట్టి కృష్ణార్జున రావు, పచ్చి నీలం ముని కేశవ్, కట్ట నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ రాంబాబు
అధ్యక్షులు
గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *