శ్రీసోమేశ్వర ఆలయానికి రెండు వెండి కలశములు.

temple temple

శ్రీసోమేశ్వర ఆలయానికి రెండు వెండి కలశములు సమర్పించిన భక్తుడు

 

పాలకుర్తి నేటిధాత్రి:

 

శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి రెండు వెండి కలశములు (చెంబులు) భక్తుడు శుక్రవారం సమర్పించినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో వినియోగించడానికి వరంగల్ కు చెందిన భక్తుడు అనంతుల రవికుమార్-స్వప్న కుటుంబ సభ్యులు రూ 1,35,000 విలువైన సోమేశ్వర స్వామికి 511గ్రాముల 500మిల్లి గ్రాముల వెండి కలశం, లక్ష్మీ నరసింహ స్వామికి 523 కేజీల 981 గ్రాముల మిశ్రమ వెండి తో తయారు 511.035 మిల్లి గ్రాముల వెండి కలశం ఆలయానికి అందజేసినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!