మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలలోని గుండేడ్ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏ ఈ ఎస్ నరసింహారెడ్డి సూచనల తో జడ్చర్ల ఎక్సైజ్ సిఐ విప్లవ రెడ్డి ఆధ్వర్యంలో గుండెడ్ గ్రామంలో సభవత్ లక్మీ అనే మహిళ ఇంట్లో రెండు కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు దీని విలువ లక్ష రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను అదుపులో కి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఏ ఈ ఎస్ నరసింహారెడ్డి తెలిపారు.