
Pulse Polio Drive in Mahendra Colony
నిండు జీవితానికి రెండు చుక్కలు.
మహేంద్ర కాలనీ లో పల్స్ పోలియో కార్యక్రమం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీ లో ని కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు మీదొడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమం లో .అంగన్వాడీ టీచర్లు తుక్కమ్మ అనిత, ఆశ వర్కర్ జ్ఞానలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.