*పిడుగు పడి రెండు ఎడ్లు మృతి
గంగాధర నేటిధాత్రి :
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
మండలానికి చెందిన కాచిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు దేశేట్టి లక్మివీరమల్లయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. ఈ ఎడ్ల విలువ దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎడ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాయి. రైతు లక్మివీరమల్లయ్య ఆ ఎడ్లపైనే ఆధారపడిన నేపథ్యంలో, ఈ ఘటన అతనికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కల్గింది. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.