గుడుంబా రవాణా చేస్తున్నా ఇద్దరి అరెస్ట్
పరకాల నేటిధాత్రి
గురువారం రోజున పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి నందిగామ రేలకుంట నుండి ఆత్మకూరు మండలంలోనికి ఆటోలో గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా సుజాత, భూక్యా జగన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.వారిని అరెస్ట్ చేసి వారివద్దనుండి ఆటో (15)లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.ఈ రూట్ వాచ్ లో పాల్గొన్న వారు
ఎస్ఐ సులోచన
కానిస్టేబుల్ లు శ్రీనివాస్, విజయ్ కుమార్,దిలీప్ పాల్గొన్నారు.