టియుడబ్ల్యూజె ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా లక్ష్మణ్ యాదవ్!! *

హర్షం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు!!

ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ టియు డబ్ల్యూజే ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నక్క లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ప్రదీప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. లక్ష్మణ్ యాదవ్ నియామకంపై జగిత్యాల జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం వెల్గటూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మాచర్ల రాజేందర్ యాదవ్, కూస లక్ష్మణ్ యాదవ్ , యువజన విభాగం అధ్యక్షుడు రాపాక మహేందర్ యాదవ్, ఎండపల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు మేకల సంతోష్ కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, రాజారాం పల్లి మాజీ సర్పంచ్ గెల్లు శేఖర్ యాదవ్, నాయకులు జక్కుల రవికుమార్ యాదవ్, కోట శ్రీశైలం యాదవ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్, జల్లెళ్ల కనకయ్య యాదవ్ లు హర్షం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *