TUWJU Leaders Submit Petition to Collector for Urdu Representation
జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ కి వినతి పత్రం అందించిన TUWJU యూనియన్ నాయకులు
◆:- జిల్లా అక్రిడేషన్ కమిటీలో ఉర్దూ యూనియన్ నాయకులకు స్థానం కల్పించాలి అని మనవి*
◆:- న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి
◆:- అనుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శనివారం రోజున సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ని కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వినతి పత్రం అందించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విలేకరులకు కూడా మండల స్థాయిలో అక్రిడేషన్ ఇవ్వాలి మరియు జిల్లాస్థాయిలో ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులను కూడా అక్రిడేషన్ కమిటీలో చేర్చాలి గతంలో న్యాయస్థానం లో న్యాయపోరాటం చేసి న్యాయస్థానాలను కూడా ఉర్దూ విలేకరులు చేస్తున్న పోరాటం న్యాయదే అని భావించి తెలంగాణ హైకోర్టు కూడా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్లను జిల్లా మరియు రాష్ట్రంలో గుర్తించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు ఆ తీర్పుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అందులో భాగంగా శనివారం రోజున జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ నీ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా అనుకూలంగా స్పందించి సంబంధించిన వారితో మాట్లాడి ఆమె ప్రాసెస్ లో ఉంది అని అతి త్వరలో కమిటీలో చేర్చేలాగా ప్రయత్నిస్తామని అనుకూలంగా స్పందించారు దీంతో సంతోషం వ్యక్తం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆయుబ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ మహమ్మద్ గౌసుద్దీన్ నిజామీ, జహీరాబాద్ ఉర్దూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ జమీరుద్దీన్ నాయకులు వసీంగౌరీ, మహమ్మద్ అల్లావుద్దీన్ మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,
